మెదక్ జిల్లా
నిజాంపేట మండల
✍️భైరవ్ రెడ్డి
నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం బీరప్ప కామారతి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు కుర్మ కులస్తుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను డప్పుచప్పులతో ఊరేగింపుగా బయలుదేరి బీరప్ప కామారతి లకు బోనాలను సమర్పించారు.

ఈ సందర్భంగా కుర్మ కులస్తులు మాట్లాడుతూ…
చల్మెడ గ్రామంలో బీరప్ప కామారతి కళ్యాణోత్సవంలో భాగంగా మొదటి రోజు పోచమ్మ బోనాలు తీయడం జరిగిందన్నారు. ఈరోజు నుండి మొదలుకొని 27 శుక్రవారం బీరప్ప కామారతి కళ్యాణం నిర్వహిస్తామని ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బీరప్ప కామారతి కృపకు పాత్రులు కావాలన్నారు.
అదేవిధంగా కుర్మ కులస్తుల ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుర్మ నాయకులు మల్లన్న లింగయ్య పుల్లన్న బీరయ్య కంపే పరశయ్య జిగిరి బాల మల్లయ్య బాగోల్ల రాజయ్య బాగోలా లింగం. ల్యాతోల్ల మల్లయ్య బాగున్న స్వామి ఎల్లం మల్లేశం, బాగొల్ల గుట్టయ్య, కురుమ కులస్తులు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.