అందంగా కనిపించేందుకు మహిళలు లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్.. ఇలా అనేక సౌందర్య సాధనాలు వాడుతుంటారు.
నిత్యం వందల మంది మధ్యలో ఉండాల్సి వస్తున్న క్రమంలో అందంగా కనిపించేందుకు ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
అందుకోసం మహిళలు ఈ కాస్మెటిక్స్ వినియోగిస్తారు. ఇప్పుడు ఈ బిజినెస్ భారత్లో 3 పువ్వులు, 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఎంతలా అంటే గత 6 నెలల కాలంలో భారత్లోని 10 నగరాల్లోనే 100 మిలియన్లకుపైగా లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్ వంటివి కొనుగోలు చేశారు. బ్యూటీ ఉత్పత్తుల కోసం ఏకంగా ఈ ఆరు నెలల్లో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేశారు. అందులో 40 శాతం మేర ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు కాంతర్ వరల్డ్ ప్యానల్ ఓ నివేదిక విడుదల చేసింది.
రిపోర్ట్ ప్రకారం.. భారతీయులు సగటున ఒక్కొక్కరు ఈ ఆరు నెలల్లో రూ. 1,214 కాస్మెటిక్స్ కోసం ఖర్చు చేశారు. అందులో పెదాలకు సంబంధించిన లిప్ స్టిక్ వంటి వాటి సేల్స్ అగ్రస్థానంలో ఉన్నాయి. 38% పెదాలు అందంగా కనిపించేందుకు వినియోగించే వాటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత నెయిల్ ఉత్పత్తులు కొన్నారు. భారతీయుల్లో అందం కోసం ఆరాటపడుతున్న తీరును ఇది తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది. అలాగే కాస్మెటిక్ మార్కెట్లో ప్రధానంగా వర్కింగ్ వుమెన్ పాత్ర ఎక్కువగా ఉందని, వారే ఎక్కువగా సౌంధర్య సాధనాలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. సగటు ఖర్చుతో పోలిస్తే ఉద్యోగం చేస్తున్న మహిళలో మేకప్ సేల్స్ ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ 1.6 రెట్లు ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తున్నారటా.షాపర్స్ స్టాప్ రిపోర్ట్ ప్రకారం.. గత మూడు నెల్లలోనే తమ సేల్స్లో 1,50,000 మేకప్ కిట్స్ విక్రయాలు జరిగినట్లు తెలిపింది.