కన్నతల్లిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి కాలువలో పడేశాడు. బెల్జియం, లీజ్ ఏరియాలోని సెరాయింగ్‌లో జూలై 10న ఈ ఘటన చోటుచేసుకుంది. 


అజ్ఞాత వ్యక్తి కాల్‌తో విషయం తెలుసుకున్న పోలీసులు అనుమానంతో కాలువలో గాలించగా.. ఓ రిఫ్రిజిరేటర్ కనిపించింది. దాన్ని బయటకు తీసి ఓపెన్ చేయగా అందులో ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. 


గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందు బాధితురాలి కొడుకును అదుపులో తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అతనిని అరెస్ట్ చేసారు.