తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో తిరుపతికి వస్తుంటారు. ఇతర అవసరాలు, పనుల మీద, బంధువులు, స్నేహితును కలుసుకోవడానికి, తిరుపతిలో చదువుకుంటున్న పిల్లలను చూడటానికి ఇలా ప్రతిరోజు లక్షలాది మంది తిరుపతి చేరుకుంటారు. తిరుమల చేరుకోవాలంటే కచ్చితంగా తిరుపతి మీదుగానే వెళ్లాలి. తిరుపతి నుంచి కాకుండా తిరుమలకు మరో మార్గం లేదు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నడక మార్గం, లేదా వాహనాల్లో తిరుమల కొండకు చేరుకోవాలి. తిరుమల కొండ మీదకు కేవలం ఏపీఎస్ ఆర్ టీసీ బస్సులను మాత్రమే అనుమతి ఇస్తారు. ఇతర రాష్ట్రాల ఆర్ టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులను అనుమతించరు. ఇక ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు, భక్తుల సొంత వాహనాలు, బైక్ లు తిరుమల కొండ మీదకు వెళ్లడానికి టీటీడీ అధికారులకు అనుమతి ఇస్తున్నారు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కువ మంది బస్సుల్లో, రైలులోనే తిరుపతికి వస్తున్నారు. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్లు తిరుమలకు, తిరుపతికి వస్తుంటారు. శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులకు అందుబాటులో తిరుమతిలో లెక్కలేనన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. తిరుమల వెళ్లడానికి, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు సందర్శించడానికి వేలాది మంది భక్తులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు.
ఇక పలు ట్రావెల్స్ కంపెనీలు చాలా కాలం నుంచి తిరుపతిలో తిరుమల భక్తుల కోసం అద్దెకు బైక్ లు ఇస్తున్నారు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, తిరుచానూరు, కపిలతీర్థం, అలిపిరి పరిసర ప్రాంతాలు, శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ సమీపంలోని బాలాజీ కాలనీ, టౌన్ హాల్ సర్కిల్, పెద్దకాపు లేఔట్ తదితర ప్రాంతాల్లోని ట్రావెల్స్ నిర్వహకులు బైక్ లు అద్దెకు ఇస్తున్నారు.
చాలాకాలం నుంచి తిరుపతిలో బైక్ లు అద్దెకు ఇస్తున్నారు. అయితే ఇద్దరు మాత్రమే తిరుమలతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో సంచరించాలంటే బైక్ లు అద్దెకు తీసుకుంటున్నారు. ఎక్కువ మందితో కలిసి తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలు, పర్యాటక కేంద్రాలు చూడాలంటే కార్లు అద్దెకు తీసుకుంటున్నారు.