ఢిల్లీలోని అఖిల భారత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్)లోని ఎండోస్కోపిక్ విభాగంలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదం రెండో అంతస్తులో జరిగింది. దీంతో ఆ వార్డులో ఉన్న రోగులతో పాటు సిబ్బందిని అత్యవసరంగా మరో ప్రాంతానికి తరలించారు. 
 
రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అందులోని వారందరినీ బయటకు పంపించి, అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో మొత్తం తొమ్మిది ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి.