రాష్ట్రంలో రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం చెప్పింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
జగిత్యాల జిల్లా , రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా , పెద్దపల్లి జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, జయశంకర్ జిల్లా , ములుగు జిల్లా , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.