రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని, ఉద్యమాలు చేస్తే పోలీసులతో ప్రభుత్వం అణచివేస్తున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికలు వస్తుండటంతో సీఎం కేసీఆర్ ఉద్యమకారులను దువ్వే పనిలో పడ్డారని, మరోసారి ఆయన చేతిలో మోసపోవద్దని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. ‘‘నేను అసెంబ్లీకి పోటీ చేయాలా? పార్లమెంట్కు పోటీ చేయాలా? ఎక్కడ నుంచి పోటీ చేయాలి? అనే విషయం హైకమాండ్ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయమే శిరోధార్యం” అని సంజయ్ చెప్పారు.