తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో దిగ్గజ కంపెనీ ముందుకొచ్చింది. మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గొరిల్లా గ్లాస్‌ తయారీ కంపెనీ తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను సెటప్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆ సంస్థ రూ. 934 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. 800 మందికి ఉపాధిని కల్పించనున్నట్లు తెలిపారు. కాగా, అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్ ఉన్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో పెట్టుబడుల కోసం అంతర్జాతీయ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి తెలంగాణ‌లో తయారీ ప్లాంట్‌ను నెల‌కొల్పాల‌ని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు…