ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఆధార్ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా. గడువు సెప్టెంబరు 14వ తేదీతో ముగియనుంది. ఈ గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించినట్లు తెలిపింది.

ఈ గడువు ముగిసిన తర్వాత కూడా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చని, అయితే, కార్డులో వివరాలు మార్చేందుకు నిర్ణీత మొత్తంలో రుసుం చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలో ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, బయోమెట్రిక్, అడ్రస్.. తదితర వివరాలలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది.