బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న వ్యక్తి సంఘటన స్థలంలోనే చనిపోయాడు.

ఈ ఘటన సోమవారం ఉదయం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.