హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా విద్యాశాఖ నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది.

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ, అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి ఎవరూ బయటికి రావద్దు అంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది.

కాగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కుండపోత వానతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. వందలాది కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి భాగ్యనగరం అంధకారంలో ఉండిపోయింది.