ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు దురాగతానికి ఒడిగట్టారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్ళితే…
ఓ దళిత మహిళకు ఇద్దరు ముస్లిం యువకులు మత్తుమందు ఇచ్చి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘోరంలో బాధితురాలి స్నేహితురాలైన ఓ ముస్లిం మహిళ కూడా పాలుపంచుకుంది.
బాధితురాలిని ఆమె స్నేహితురాలు ఓ హోటల్ కి రమ్మని పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను బీఫార్మ్ విద్యార్థి షోయబ్, బార్బర్ గా పనిచేస్తున్న నజీమ్ గా గుర్తించారు. ఈ మొత్తం అత్యాచార ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి రూ. 5 లక్షలు ఇవ్వాలని నిందితులు, బాధిత మహిళను బ్లాక్మెయిల్ చేశారు.
ఈ ఘటన అనంతరం చిత్రీకరించిన వీడియోను బాధితురాలి భర్తకు పంపారు. నిందితులిద్దరు కాశ్మీర్ పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటన గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన ముస్లిం స్నేహితురాలి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బును రిటన్ ఇవ్వాలని అనుకుంది. సెప్టెంబర్ 2న నిందితురాలు ఆమెను ఓ కేఫ్ కి పిలిచింది. అక్కడే ఇద్దరు యువకులు ఉన్నారు. ఆ తర్వాత బాధిత మహిళను ఓ హోటల్ కి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.