భద్రాది – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ

గత రెండు సంవత్సరాలుగా పాల్వంచ మున్సిపాల్టీ లో స్వేచ్ఛ వర్కర్స్, డ్రైవర్స్, హెల్ఫర్స్ మొత్తం 54 మంది విధులు నిర్వహిస్తూ పాల్వంచను స్వచ్ఛ మున్సిపాల్టీ గా తీర్చిదిద్దుటలో తమ వంతు పాత్ర పోషిస్తున్న తీరు అమోఘం.
వీరికి ప్రభుత్వం వేతనాలు అందించకుండా, ఇంటి యజమానులు నెలకు యాభై రూపాయలు చొప్పున చెల్లించే పైకమే వీరి కడుపు నిండాలి. వర్కర్స్ తెల్లవారుజామునుండి ఇంటిఃటికి తిరిగి తడి పొడి చెత్తలను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తారు. వాస్తవానికి ఇంటి యజమానులే తడి పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ అధికారులు ఇచ్చిన నీలం,పచ్చ డబ్బాల్లో వేరు వేరుగా అందించాలి. వేరు వేరుగా తడి పొడి చెత్తలను వర్కర్స్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తారు.
తడి చెత్త ఎరువులు తయారీకి, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే ఇతర రాష్ట్రాలకు తరలిస్తారు. ఇంత వరకు బాగానే వుంది గాని ఈ రోజు మాత్రం వర్కర్సే ఇంటి యజమానులిచ్చిన చెత్తలను తడి పొడిగా వర్కర్సే వేరు చేసి డంపింగ్ యార్డులకు తరలించాలని మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేసారు.
దీనికి నిరసనగా ఈ రోజు స్వచ్ఛ వర్కర్స్ విధులు బహిష్కరించారు.
ఈ సందర్భంగా మీడియాతో తో స్వచ్ఛ వర్కర్స్ మాట్లాడుతూ…
జీతాలు సరిగా లేక,వెట్టి చాకిరి చేస్తున్న మమ్మల్ని మమ్మల్నే తడి పొడి చెత్తను వేరు చేయమనడం దారుణమన్నారు. ఇంటి యజమానులు వేరు చేస్తేనే మేము డంపింగ్ యార్డ్ కు తరలిస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ దగ్గర తడి పొడి చెత్తలను మేము స్వచ్ఛ వర్కర్స్ వేరు చేయలేమని, పని భారం అధికమవుతుందని వాపోయారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్వచ్ఛ వర్కర్స్,హెల్ఫర్స్, పార్వతీ, రమణ, భవాని, కళ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.