తెలంగాణలో 10th పరీక్షలకు 4,86,194 మంది విద్యార్థులకుగాను, 4,84,384 మంది విద్యార్థులు (99.63శాతం) హజరుకాగా, ఈ పరీక్షలు నిన్నటితో ముగిశాయి.
పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు మే 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి.
ఇక పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనుంది. ఫలితాలు మాత్రం మే 10వ తేదీన వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.
జూన్ ఒకటో తేదీ నుంచి 2023 – 24 ఇంటర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది.