డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ సిట్ పోలీసులు, బిగ్ బాస్కెట్​కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు,
హెచ్​డీఎఫ్​సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు.

బిగ్ బాస్కెట్​కు సంస్థ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు, పాలసీబజార్ వినియోగదారుల వివరాల లీకేజీ పై సంస్థ ప్రతినిధులు గతేడాది అక్టోబర్​లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.

HDFC బ్యాంకు ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు.