డేటా చోరీ కేసులో ఇప్పటి వరకు 19మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ సిట్ పోలీసులు, బిగ్ బాస్కెట్కు చెందిన 3 కోట్ల మంది ఖాతాదారుల వివరాలు,
హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు చెందిన 7.5 జీబీ డేటా బయటికి వెళ్లినట్లు గుర్తించామని తెలిపారు.
బిగ్ బాస్కెట్కు సంస్థ ప్రతినిధులు సైతం ఒప్పుకున్నట్లు, పాలసీబజార్ వినియోగదారుల వివరాల లీకేజీ పై సంస్థ ప్రతినిధులు గతేడాది అక్టోబర్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.
HDFC బ్యాంకు ప్రతినిధులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సిట్ అధికారులు తెలిపారు.