బీజేపీ హైకమాండ్ పిలుపుతో తెలంగాణ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల టైం మాత్రమే ఉండడంతో హైకమాండ్​ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.

బీఆర్ఎస్, కాంగ్రెస్​లో ఉన్న అసంతృప్తులను పార్టీలో చేర్చుకుని బీజేపీని బలోపేతం చేయాలనే చర్యలలో భాగంగానే సంజయ్​కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నేతలతో చర్చించినట్లు, అక్రమ అరెస్ట్​ గురించి అడిగినట్లు, కేసీఆర్​ అరాచకాలన్నీ పార్టీ పెద్దలకు వివరించినట్లు సంజయ్​ తెలిపారు.

బూత్​ స్వశక్తి కరణ్​ అభి యాన్​ మీటింగ్​లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. జూపల్లి చేరికపై డీకే అరుణ మాట్లాడారని, 15న వరంగల్​లో నిరుద్యోగ మార్చ్​ నిర్వహిస్తున్నామని తెలిపారు.