బీజేపీ హైకమాండ్ పిలుపుతో తెలంగాణ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల టైం మాత్రమే ఉండడంతో హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.
బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులను పార్టీలో చేర్చుకుని బీజేపీని బలోపేతం చేయాలనే చర్యలలో భాగంగానే సంజయ్కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నేతలతో చర్చించినట్లు, అక్రమ అరెస్ట్ గురించి అడిగినట్లు, కేసీఆర్ అరాచకాలన్నీ పార్టీ పెద్దలకు వివరించినట్లు సంజయ్ తెలిపారు.
బూత్ స్వశక్తి కరణ్ అభి యాన్ మీటింగ్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. జూపల్లి చేరికపై డీకే అరుణ మాట్లాడారని, 15న వరంగల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.