మెదక్ జిల్లా
చేగుంట
✍️భైరవ్ రెడ్డి

చేగుంట రోడ్డు ప్రమాదంలో బిజెపి నాయకుడు మృతి చెందిన సంఘటన మెదక్ రహదారిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ర్యాపాకుల సతీష్ గౌడ్ (24) చిన్న శంకరంపేట మండల కేంద్రం నుంచి స్వగ్రామమైన చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సతీష్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక తెలిపారు. ఐదు నిమిషాలలో ఇంటికి చేరే సమయంలో సతీష్ గౌడ్ ఈ ప్రమాదం లో మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదఛాయలు అల మ్ముకున్నాయి.