మెదక్ జిల్లా
రామాయంపేట
✍️భైరవ్ రెడ్డి

టి యు డబ్ల్యూ జె. ఐ జే యు మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసనపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా టి యు డబ్ల్యూ జె ఐ జె యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ హాజరైనారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ మాట్లాడుతూ…

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కార్యవర్గంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ముఖ్యంగా ఇల్లు లేని జర్నలిస్టులకు ఇల్లు అక్రిడేషన్ రాని జర్నలిస్టులకు అక్రిడేషన్లు రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డుల కోసం కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి కార్యదర్శి సంతోష్ రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యుడు అక్రిడేషన్ కమిటీ మెంబర్ మిన్పూర్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీజే శర్మ ఐజేయు మాజీ సభ్యుడు కంది శ్రీనివాస్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.