మెదక్ జిల్లా
నిజాంపేట మండలం
✍️భైరవ్ రెడ్డి

నిజాంపేట మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

2014 ముందు తెలంగాణ ఏ విధంగా ఉండేది తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసునని మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని గ్రామాలే దేశానికి ఆయువు పట్టని గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో పాటు పడుతున్నారని అన్నారు. ఇప్పటివరకు నిజాంపేట మండల అభివృద్ధికి తన ఎమ్మెల్సీ కోటా నుంచి కోటి రూపాయల వరకు నిధులు మంజూరు చేశానని మున్ముందు నిజాంపేట మండల అభివృద్ధికి తోడ్పడుతానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రాంపూర్ చల్మెడ గ్రామాలలో సిసి రోడ్డులకు డ్రైనేజీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం చల్మెడ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఫంక్షన్ హాల్ కు తన వంతు సహాయంగా ఐదు లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.

ఈ కార్యక్రమంలో చల్ మెడ సర్పంచ్ చప్పట నరసింహారెడ్డి రాంపూర్ సర్పంచ్ జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.