మెదక్ జిల్లా కేంద్రం
ఏప్రిల్, 20, 2023
✍️భైరవ్ రెడ్డి
ఈ నెల 23 న అక్షయ తృతీయ సందర్భంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను కలెక్టరేట్ లో అధికారికంగా నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తామని, ఇట్టి కార్యక్రమంలో, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబంది అందరు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా ఆయన కోరారు.