మెదక్ జిల్లా కేంద్రం
ఏప్రిల్ 20, 2023
✍️భైరవ్ రెడ్డి
విద్యార్థులలో మానసిక ఉల్లాసానికి, విజ్ఞానానికి ఈ నెల 22 నుండి మే 6 వరకు మెదక్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల నందు స్పార్కిల్స్ క్యాంపు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. గురువారం తన ఛాంబర్ లో స్పార్కిల్స్ క్యాంపుకు సంబందించిన గోడపత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…
ఈ నెల 22 నుండి పక్షం రోజుల పాటు వెస్ట్రన్ డాన్స్,వేదిక్ మాథ్స్, మ్యూజిక్, లైఫ్ స్కిల్స్ మరియు స్పార్కిల్స్ పై క్యాంపు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇందులో సాంఘీక సంక్షేమమే, గిరిజన సంక్షేమం, ఏకలవ్య పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రధానాచార్యులు వరలక్ష్మి, సీనియర్ వైస్ ప్రిన్సిపల్ ఉమారాణి తడిఆరులు పాల్గొన్నారు. .