మెదక్ జిల్లా
నిజాంపేట మండలం
నందిగామ గ్రామం
✍️ భైరవ్ రెడ్డి
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గుడ్ షెఫర్డ్ హైస్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల బృందం గ్రాడ్యుయేషన్ నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యనభ్యసించిన విద్యార్థులకు సన్మానం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని పాఠశాల ప్రిన్సిపాల్ రాజు పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులకు 10 సంవత్సరాలుగా విద్య బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు విద్యార్థులు శాలువాతో సన్మానం చేశారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ వీడ్కోలు వేడుకల్లో విద్యార్థులు నృత్యాలు ఆటపాటలతో అలరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ…
కార్పొరేట్ స్కూల్ కి దీటుగా అతి తక్కువ ఫీజులతో మంచి వాతావరణాన్ని కల్పిస్తూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచేవిద్యబోధన అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వామి, సంపత్, రవియాదవ్, రమేష్, కవిత, స్రవంతి, మనిలా, తదితరులు పాల్గొన్నారు.