మెదక్ జిల్లా కేంద్రం
✍️భైరవ్ రెడ్డి

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్ పట్టణం నవపేట్ “ఈద్గా” వద్ద ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి యం. పద్మాదేవేందర్ రెడ్డిగారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

గత నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియామ నిష్ఠలతో ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్ మాసం నేటి చివరి రోజు ముగుస్తుందన్నారు.

ఈ నేపథ్యంలో ఈద్గాలో ఏర్పాటు చేసిన రంజాన్ పండుగ వేడుకలో పాల్గొన్నడం చాలా సంతోషంగా ఉందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి కొరకు మైనార్టీ స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ అల్లా దయతో మీరు కోరుకున్న విధంగా కోరికలు తీర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. ముస్లిం సోదరి సోదరులకు హృదయ పూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, కౌన్సిలర్లు సమియొద్దీన్, కృష్ణారెడ్డి, నర్వ. లక్ష్మీనారాయణ గౌడ్, వసంత్ రాజ్, జయరాజ్, బిమరి కిషోర్, కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ ఉమర్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ పురం వెంకటనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెడిశెట్టి,శంకర్ నాయకులు రాగి.అశోక్, లింగారెడ్డి, ముత్యం గౌడ్, బొద్దుల. కృష్ణ శివరామకృష్ణ, కొండా. శ్రీనివాస్, జుబేర్ అహ్మద్, మహమ్మద్ ఉమర్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.