సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్
ఏప్రిల్ 23,3023
✍️భైరవ్ రెడ్డి
జహీరాబాద్ పరిమిత స్టేజీలతో ప్రయాణికులకు వేగవంతమైన బస్సు సర్వీసులే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు సాగుతోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో మూడు కొత్త డీలక్స్ బస్సులను డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆర్టీసీ ఆర్ఎం సుదర్శన్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో బస్సులకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే జెండా ఊపి సర్వీసులు ప్రారంభించారు. అనంతరం బస్సును స్వయంగా నడిపి అధికారులు ఆర్టీసీ కార్మికులను ఉల్లాసపరిచారు. అంతరాష్ట్ర పట్టణం జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ కు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం కేవలం సదాశివపేట, సంగారెడ్డి చౌరస్తా హాల్టులతో డీలక్స్ బస్సులు రాకపోకలు సాగిస్తాయని అన్నారు. దూర ప్రాంత ప్రయాణికులు టూ స్టాప్ పేరిట ప్రారంభించిన బస్సులను ఆదరించి రాకపోకలు సాగించాలని కోరారు.
ఆర్ఎం సుదర్శన్ మాట్లాడుతూ…
జహీరాబాద్ మీదుగా ప్రయోగాత్మకంగా మూడు డీలక్స్ సర్వీసులు ప్రారంభించామని ప్రయాణికులు ఆదరిస్తే మరిన్ని సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా డిపో ప్రాంగణంలో నిర్వహించిన బసవేశ్వర జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.