సంగారెడ్డి జిల్లా
✍️భైరవ్ రెడ్డి

కంది పరిధిలోని ఐఐటి లేబర్ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఐఐటి లేబర్ కాలనీ లోని కార్మికుల అవసరాల కోసం కొందరు దళారులు అక్రమంగా గ్యాస్ 14 కేజీ కొన్ని వాటిల్లో నుంచి గ్యాస్ తీసి 5 కేజీల డొమెస్టిక్ సిలిండర్లలలో నింపి అమ్మకానికి పెట్టారు. ఐదు కేజీల సిలిండర్లలో నాజిల్స్ సరిగ్గా అమర్చకపోవడంతో వాటిల్లో నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. ఆ షాపులో పక్కనే ట్రాన్స్ఫారం ఉండడంతో శనివారం ఉదయం షాప్ లో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా పొగలు వచ్చి సిలిండర్లు పేలాయి. 15 అడుగుల మేర మంటలు ఎగిసిపడ్డాయి. 100 మీటర్ల దూరంలో సిలిండర్ శకలాలు పడ్డాయి. పక్కనే ఉన్న కిరాణా జనరల్ స్టీల్ సామాన్ల దుకాణం, టిఫిన్ సెంటర్లు దగ్ధమయ్యాయి.

ఈ ఘటనతో ఐఐటీ లోని లేబర్ కాలనీలో నివసిస్తున్న కార్మికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సిలిండర్ల షాపు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పి వేశారు.