సిద్దిపేట జిల్లా కేంద్రం
✍️భైరవ్ రెడ్డి
ఏప్రిల్ 24,2023
సిద్దిపేటలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన అర్జిదారుల నుండి జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వస్తున్నారని అంతే నమ్మకంగా అర్జిదారులకు న్యాయం చేసే విదంగా పని చెయ్యాలని జిల్లా అధికారులకు సూచించారు. భూసంబంధిత, రెండు పడకగదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు ఇతరత్ర మొత్తం కలిపి (53) దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి లక్ష్మీ కిరణ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.