జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 24,2023

జగిత్యాల జిల్లా కేంద్రంలోని “మానస ఎక్సల్లెన్స్” స్కూల్ ఐఐటి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మానస వార్షికోత్సవ వేడుకలు కల్చరల్ డిలైట్ 2కే23 పేరిట అట్టహాసంగా సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనల్లో నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థులు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించారు.

ప్రధానంగా జానపద నృత్యాలు, అమ్మవారి నృత్యాలు, శివతాండవం, దశావతారముల నృత్యం, వండర్ కిడ్స్ పర్ఫామెన్స్ , హులహుప్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, ఉపాధ్యాయినిలు, పోషకులు వారి కుతూర్లతో చేసిన నృత్యం ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి.


పిల్లలపై తండ్రి ప్రేమ మమకారం కూతురు, కొడుకుల పై తల్లికి ఉండే అమృతమైన ప్రేమ, మగువల ప్రాముఖ్యతని తెలిపే నాటికలు ఆహుతులను ఎంతగానో ఆకట్టకున్నాయి.


అంతేకాకుండా హనుమాన్ చాలీసాకు సంభoదించి చేసిన ప్రదర్శన కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రజితరావు ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల సాధించిన ఘనతలు , విజయాలు చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బి.హరిచరణ్ రావు, శ్రీధర్ రావు , జె.హరిచరణ్ రావు, మౌనిక రావు , రజిత రావు, అజిత రావు, సుమన్ రావు గార్లు మరియు ఉపాధ్యాయ బృందం ,వందల సంఖ్యలో తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.