మెదక్ జిల్లా
ఏప్రిల్ 21, 2023
✍️భైరవ్ రెడ్డి
వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్: శ్రీమతి రోహిణి ప్రియదర్శిని IPS.
ఈ రోజు మెదక్ జిల్లా నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్,హోం గార్డ్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన స్క్వాడ్ డ్రిల్ ప్రదర్శనని పరిశీలించారు.
ఈ సందర్బంగా SP గారు మాట్లాడుతూ…
వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు , సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్ నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు.ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని అన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న చెప్పవచ్చు అన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని మెదక్ జిల్లాకి, తెలంగాణ పోలిస్ శాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు.
ఈకార్యక్రమంలో తూప్రాన్ డి.ఎస్.పి శ్రీ.యాదగిరిరెడ్డి గారు, మెదక్ డి.ఎస్.పి.శ్రీ. సైదులు గారు, ఆర్.ఐ శ్రీ.అచ్యుత రావ్ గారు, జిల్లా సి.ఐలు, ఎస్.ఐ.లు, ఆర్.ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.