మెదక్ జిల్లా
ఏప్రిల్ 26, 2023
✍️భైరవ్ రెడ్డి

ఈ రోజు మెదక్ జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆదేశానుసారం రామాయంపేట సర్కిల్ చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ పరిది చందాపూర్ గ్రామంలో రామాయంపేట సి.ఐ.శ్రీ.చ్ణద్రశేఖర్ రెడ్డి గారి ఆద్వర్యంలో, ఎస్సైలు-05 గురు మొత్తం 20 మంది పోలీసు అధికారులతో ఆకస్మికంగా కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా తనిఖీలు నిర్వహించి సుమారు 140 ఇళ్లను సోదాలు చేశారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సి‌సి కెమెరాల ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించినారు. నంబర్ ప్లేట్ సరిగా లేని ద్విచక్ర వానాలు పత్రాలు సరిగాలేని 18 ద్విచక్ర వాహనాలు, అదుపులోకి తీసుకొని చిన్నశంకరంపేట పోలీస్టేషన్ కు తీసుకువెళ్లారు. సంబంధిత వాహనాల యజమానులు తమ వాహనాల పత్రాలను చూపించి వాహనాలను తీసుకువెళ్లాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు మాట్లాడుతూ….

నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని,ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం,సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. వాహనాల సంబందించిన ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అన్నారు. ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దానిని రెన్యువల్ చేపించుకోవాలని సూచించారు. ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. కాలనీలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు.