జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 27, 2023
✍️కిషన్ రెడ్డి

కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి అని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, మంద మకరందలు తెలిపారు.

గురువారం జిల్లా సమీకృత సముదాయాల భవనంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ…

భగీరథ మహర్షి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. చారిత్రక పురుషుల, సంఘ సంస్కర్తల, మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప సంప్రదాయమని, ఆయా వర్గాలకు ఆత్మగౌరవ సూచిక అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దిక్సూచిగా నిలువడం గర్వకారణమన్నారు. ప్రజల జీవవ ప్రమాణాల మెరుగుదలకు శాశ్వత పరిష్కారందిశగా ప్రణాళికాబద్ధంగా బాటలు వేశారన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయిబాబా, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగార్జున, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, బిసి సంఘాల నాయకులు హరి అశోక్ కుమార్, ముసిపట్ల లక్ష్మీనారాయణ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.