జగిత్యాల జిల్లా
ఏప్రిల్ 26,2023
✍️ కిషన్ రెడ్డి
దేశ సంపదను బడా పారిశ్రమీకవేత్తలకు దొచిపెడుతున్న “మోడీ”
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
అర్హులైన వారికి దళిత బందు, పెన్షన్లు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలి
వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి
ధరణి పోర్టల్ తో రైతులకు కొత్త సమస్యలు
పేద ప్రజలకు అండగా ఎర్ర జెండా
భారతదేశ సంపదను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడా పారిశ్రామిక వేత్తలకు ధోచిపెడుతున్నాడని ఇందుర్తి మాజీ శాసన సభ్యులు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా బీజేపీ హటావో… దేశ్ కి బచావో అనే నినాదంపై పల్లె పల్లెకు సిపిఐ.. ప్రజల వద్దకు సిపిఐ జన చైతన్య యాత్ర బుధవారం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, వెల్గటూర్ తోపాటు ధర్మారం మండలాల్లో 4 వ రోజు కొనసాగగా చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
ఈసంధర్బంగా గొల్లపల్లి, వెల్గటూర్ సభల్లో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…
ప్రజా సమస్యల తెలుసుకోవడం కోసం సిపిఐ నాయకులు గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులపై నల్ల చట్టాలను ప్రయోగించి అనేక ఇబ్బందులకు గురించేసిందని విమర్శిస్తూనే కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడూలుగా విభజించి పెట్టుబడి దారులకు అనుకూలంగా మలిచిందన్నారు. నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్రం పెంచి పేద ప్రజలపై పెనుబారం మోపిందని మండిపడ్డారు.నిత్యావసర వస్తువుల ధరలను పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను మరింత పేదరికంలోకి నెత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద ప్రజలకు పల్లెల్లో ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి కేంద్రం నిధులు బడ్జెట్ లో తగ్గించి పథకాన్ని ఎత్తివేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి అన్నీ వర్గాలను మభ్యపెడుతుందని వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు.
దళితులకు మూడు ఎకరాల భూమి ఏమయిందని ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ కొత్తగా అన్నీ రకాల పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడు రూమ్ ఇళ్ళు, దళితబందు అందించాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణానికి 3 లక్షలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఆచరణలో పెట్టలేదని,ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పసుపుబోర్డు తీసుకువస్తానని బాండు పేపర్ రాసి ఇచ్చి గెల్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దాని ఊసే లేదని విమర్శించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ తో రైతుల సమస్యలు మరింత పెరిగాయని ఈవిషయంలో హైకోర్టు కుడా మందలించిందని, వెంటనే రైతుల భూములకు సంబందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించారు.
జగిత్యాల బీడీ కార్మికులు చాలా మంది ఉన్నారని వారి సమస్యల పరిష్కారం కోసం జగిత్యాల కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని అందులో తాను పాల్గొంటానని వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరుష్కరించుకోవచ్చన్నారు.
పేదప్రజల కోసం పోరాడేది ఒక్క సిపిఐ పార్టీ అని చెబుతూ,పేదలకుఎల్లప్పుడూ ఎర్ర జెండా అండగా ఉంటుందని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లాలో 4 రోజుల సభలు పెగడపల్లి, మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం , జగిత్యాల, గొల్లపల్లి, వెల్గటూరు సభలు విజయవంతమయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సభకు వర్షం అంతరాయం కలిగించినప్పటికి పెద్ద ఎత్తున మహిళలు, కార్మికులు, కర్షకులు, పార్టీ నాయకులు తరలివచ్చి సభను సక్సెస్ చేశారు. ప్రజా నాట్యమండలి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు ఆకట్టుకున్నాయి. ప్రజల నుండి వివిధ రకాల సమస్యలు పరిష్కరించాలని వెంకట్ రెడ్డి కి దరఖాస్తులు ఇచ్చారు.
సభల్లో జగిత్యాల జిల్లా కార్యదర్శి వెన్న సురేష్, కరీంనగర్, సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి,మంద పవన్, గుంటి వేణు, కొయ్యడ సృజన్ కుమార్, బూడిద సదాశివ, పద్మ, గూడెం లక్ష్మీ, శారద, ప్రజా నాట్యమండలి కళాకారులూ, ప్రజలు, మహిళలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.