జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 29,2023
✍️కిషన్ రెడ్డి
డాక్టర్ల నిర్లక్ష్యంతో
బలి అవుతున్న మహిళల ప్రాణాలు
జగిత్యాల మాత శిశు ఆసుపత్రి సిబ్బందిపై ఫి
జాతీయ మానవహక్కుల మండలి జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం వెల్లడి
జగిత్యాల ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆపరేషన్లు వికటించి జగిత్యాలలో జరిగిన పలువురు బాలింతల మరణం, కడుపులో గుడ్డ పేలుకలు మరిచిన సంఘటన పై శనివారం జాతీయ మానవ హక్కుల మండలి స్వచ్చంద సంస్థ నేతృత్వంలో జాతీయ మానవ హక్కుల కమీషన్ కు పిర్యాదు చేశారు.
జాతీయ మానవహక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అయిల్నేని శ్రీనివాసరావు ఆదేశాలతో జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం అధ్వర్యంలో యూత్ వింగ్ , మహిళా వింగ్ సభ్యులు ఫిర్యాదు చేశారు. జగిత్యాల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గత ఆరు నెలలుగా జరిగిన ఆపరేషన్స్ వికటించి పలువురు బాలింతలు మరణించారు.
అలాగే ఈ మధ్యకాలంలో మరో మహిళ ఆపరేషన్ సమయంలో కడుపులో గుడ్డ పేలికలు మరిచిపోయిన సంఘటన సంచలనం రేకెత్తించింది.
ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని జాతీయ మానవ హక్కుల కమీషన్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లతకు పిర్యాదులు చేశారు. సరైన విచారణ జరిపించి బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే బాధిత కుటుంబీకులను అన్ని రకాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూస్తూనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
జాతీయ మహిళా కమీషన్ న్యూ ఢిల్లీ , జాతీయ మానవ హక్కుల కమీషన్ న్యూ ఢిల్లీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, ఆరోగ్య శాఖ మంత్రి కి
ఈ మెయిల్, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పిర్యాదు చేసినట్లు సంస్థ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం తెలిపారు.