జగిత్యాల జిల్లా కేంద్రం
ఏప్రిల్ 29,2023
✍️ కిషన్ రెడ్డి

జీవన్ రెడ్డి రాజకీయ నిబద్ధత ఏమిటో కేసీఆర్ ను అడుగు…

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని విమర్శించే స్థాయి రవిశంకర్ కు లేదు – డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రవిశంకర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. – చొప్పదండి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం ఫైర్

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజకీయ నిబద్ధత ఏమిటో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగితే మీకు తెలుస్తుందని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడింది అర్దం చేసుకోకుండా ఆయనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం మానుకోవాలని, మరోసారి ఆరోపణలు చేస్తే ఊరుకోమని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

శనివారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళలో దళితులకు ఎంతో చేసిందన్నారు. దళితులకు ఎన్నో అవకాశాలను కల్పించారని జీవన్ రెడ్డి సహకారంతో నేని పొజిషన్లో ఉన్నానని లక్ష్మణ్ కుమార్ చెప్పుకొచ్చారు. దళిత బందు పతకములో అక్రమాలకు పాల్పడిన వారి చిట్టా ఉందని ముఖ్యమంత్రి అంటే ఆ విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడరన్నారు. ఇందులోనూ ముఖ్యమంత్రిని ఆన్ పార్లమెంట్ భాషలో మాట్లాడలేదని కేవలం దళితులకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఎందుకు ఖర్చుచేయలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారని తెలిపారు.

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పచ్చి అబద్దాలు అడుతున్నాడని, స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని ఇది పద్ధతి కాదన్నారు. చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెడిపెల్లి సత్యం మాట్లాడుతూ… ఆరెస్సెస్ నుంచి ఆరెస్యూ వరకు కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు రాష్ట్రంలో ఆదరించే ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అని అన్నారు.

కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ సమాజం చేత గౌరవింపబడుతున్న నాయకుడు జీవన్ రెడ్డి అని ఇలాంటి నాయకుడిపై చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ స్థాయి మరిచి మాట్లాడారని నోరుఆదుపులో పెట్టుకోవాలని సత్యం హెచ్చరించారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏర్పడిన అభద్రతబావంతో జీవన్ రెడ్డిపై అనవసరపు మాటలు మాట్లాడారన్నారు.

కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసిందేమని రవిశంకర్ ప్రశ్నించారని వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ దళితులకు చేసిందేమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితున్ని ముఖ్యమంత్రిని చేసిందని, ఏఐసిసి అధ్యక్షునిగా దళితున్ని నియమించిందని సత్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటర్లుగా చూడలేదని బీఆర్ ఎస్ పార్టీ దళితులను ఓటర్లుగా చూస్తోందని సత్యం అన్నారు.

123 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2015 లో శంకుస్థాపన చేస్తే ఎన్నికల వేళ మొన్న ప్రారంభించారన్నారని ఇదంతా ఓట్ల కోసం బీఆర్ఎస్ పార్టీ ఓట్ల రాజకీయమన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన జీవన్ రెడ్డిపై ఇంకోసారి అనవసరంగా మాట్లాడితే ఊరుకోమని రవిశంకర్ ఒళ్లుదగ్గర పెట్టుకొని మాట్లాడాలని మెడిపెల్లి సత్యం హెచ్చరించారు.

ఈ సమావేశంలో టీపీసీసీ నేత బండ శంకర్, కాం గ్రెస్ కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్, నాయకులు మన్సూర్ ,మున్న, గుండా మధు, బీరం రాజేష్, రమేష్ బాబు తోపాటు పలువురు ఉన్నారు.