జూన్ 02, 2023

తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల పతాకావిష్కరణ సంధర్భంగా మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీమతి రోహిణి ప్రియదర్శి ఐ.పి.యెస్ గారు తెలంగాణ తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసారు.

అనంతరం జిల్లా ఎస్.పి. గారు మాట్లాడుతూ….

తెలంగాణా అమరవీరుల త్యాగ పలితంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైందని, ఎంతో మంది గొప్ప, గొప్ప వ్యక్తులు తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా తెలంగాణా రాష్ట్ర సాధనకు అలుపెరుగని కృషి చేసారని అన్నారు . అదే విదంగా పోలీసు శాఖ లో పనిచేసే ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది తమ వంతు బాధ్యతగా ప్రజా రక్షణే కర్తవ్యంగా.. ప్రజల సేవయే ధ్యేయంగా పనిచేస్తు తెలంగాణ పోలీసు సేవలను ప్రజలకు మరింతగా అందించి తెలంగాణ పోలీసుకు మరియు జిల్లా పోలీస్ శాఖకు మరింతగా మంచి పేరు వచ్చేవిధంగా పనిచేయాలని అన్నారు, అదేవిధంగా కలిసి కట్టుగా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని సిబ్బందికి సూచించారు,

జిల్లాలో ఉత్తమ పనితీరు కనభరిచిన తూప్రాన్ సి.ఐ శ్రీ.టి.శ్రీధర్, ఆర్.ఐ.శ్రీ.అచ్యుత రావ్, పాపన్నపేట ఎస్. ఐ.శ్రీ.విజయ్ నారాయణ్, కానిస్టేబుళ్లు శ్రీ.లక్ష్మినారాయణ, అమర్నాథ్ లకు పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ.తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు.