లిక్కర్ స్కాం నుండి బిడ్డను కాపాడుకోవడానికి బీజేపీతో కుమ్మకు

కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్న కేసీఆర్ వ్యాఖ్యాలపై ఎమ్మెల్సీ ఫైర్

ప్రజల ఆకాంక్ష నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్

“ధరణి” పరిష్కారం కోసం రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్

జగిత్యాల జిల్లా కేంద్రం
జూన్ 5,2023

లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డ ఎమ్మెల్సీ కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని, ప్రధాని మోదీ మెప్పు పొందేందుకు కాంగ్రెస్ పార్టీని బంగళాఖాతంలో కలుపుతవా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

నిర్మల్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని ఫైర్ అయ్యారు. జగిత్యాలలోని ఇందిరా భవన్ లో సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల దశాబ్ధాల కల స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా రైతులకు ఉచిత కరంట్ అమలు చేసి, ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు.తప్పా, తాలు లేకుండా కళ్ళం కాడ వడ్లు కొనుగోలుచేశామని, నిరుపేదలకు ఆరోగ్య శ్రీ,104,108 పేరుతో ఉచిత వైద్య సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాలికా సంరక్షణ పథకం రూపొందించామని, పంట రుణాలపై వడ్డీ రాయితీ, విత్తన రాయితీ ఇచ్చామని, నిరంతరం అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించడంతో పాటు 9 రకాల వస్తువులు అందించామని, అర్హత ప్రాతిపాదికన గృహ నిర్మాణ పథకం అమలుచ్చేశామని జీవన్ రెడ్డి అన్నారు. అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన కేసీఆర్ కుటుంబ ప్రయోజనం కోసమే పనిచేస్తు, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖతంలో కలపాలని నిర్మల్ సభలో మాట్లాడo మోడీ మెప్పు పొందడానికేసమేనని చెప్పుకొచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టరాని కేసీఆర్ తిరుపట్ల మండిపడ్డారు.

ఎన్టీపిసిలో విధ్యుత్ ఉత్పాదన చేయకుండా ₹ 40 వేల కోట్ల భారంతో కమిషన్ల కక్కుర్తి కోరకు యాద్దాద్రి ఏర్పాటు చేశావని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఎవరూ బంగాళాఖాతంలో కలుపుతారో నాలుగు నెలలు ఆగితే ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

మీ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారా అంటూ నిలాదీశారు. ధరణి అనేది ప్రభుత్వానికి ఆదాయ పన్ను శాఖగా మారిందని విమర్శించారు. ప్రతి జిల్లాలో లక్ష ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, ఎలాంటి కారణాలు చూపకుండా దరఖాస్తులను నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధరణి దరఖాస్తులు పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక రైతుబంధు పేరు చెప్పి రైతులకు రావలసిన అన్నీ రకాల రాయితీలు రాకుండా చేస్తున్నారన్నారు. ఇకనైనా స్వార్థ ప్రయోజనాలు వీడాలని సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు.

ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, టీపీసీసీ నేత బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జున్ను రాజేందర్, జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు మన్సూర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండా మధు, బొల్లి శేఖర్, నేహాల్, బీరం రాజేష్, లైశెట్టివిజయ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.