మెదక్ అర్బన్
జూన్ 5,2023

సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని, ప్రజా సంక్షేమం లోనూ.. అభివృద్ధిలోనూ. యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచి తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందని చెప్పుకునే స్థాయికి చేరిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో లక్షా 24 వేల ఉన్న తలసరి ఆదాయం.. 2022-23లో 3 లక్షాల 17 వేలకు చేరుకొని తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. కేంద్రం ఏకాణా ఇయ్యకున్నా స్వీయ శక్తితో ముందుకు సాగుతోందన్నారు. ఎంత మంది సీఎం లు, పీఎంలు మారినా ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోయారన్నారు. కేవలం మూడున్నరేళ్లలో మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలో ఇంటింటికి తాగు నీరు అం

దించామని, ఇదే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్, మిషన్ కాకతీయ తరహాలో అమృత్ సరోవర్ పేరిట కాపీ కొట్టిందన్నారు. ఇదొక్కటే కాదనీ.. ఇలా చాలా సంక్షేమ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. దేశంలో 2.96 శాతం ఉన్న తెలం గాణకు 38 అవార్డులు వచ్చాయన్నారు. అడవులు పెంపకంలో 7.4 శాతంతో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కళాశాల ప్రారంభం…

60 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజ్లు ఉంటూ. 9 ఏళ్లలో 21 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 33 జిల్లాలో మెడికల్ కాలేజ్లను ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మెదక్లో మెడికల్ కళాశాలను

ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

కేంద్రం నిధులు ఆపడం వల్లే వేతనాలు ఆలస్యం…

రాష్ట్రంలోనే బలమైన ఉపాధ్యాయ సంఘం అయిన పీఆర్టీయూ హక్కుల కోసమే కాకు డా విద్యార్థుల సమస్యల కోసం పోరాడిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఈ “సంఘం మరింత అద్భుతంగా ముందుకు వెళ్లాలని, ఉన్నత విద్యా బోధనకు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని అన్నారు.