ఆరోగ్య పరిరక్షణకు యోగ తప్పనిసరి అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునిచ్చారు. చేగుంట మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో కలిసి యోగా చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ…

ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అన్నిటికంటే ముఖ్యమని ఆరోగ్యం లేకుండా ఉంటే ఏమి చేయలేమని ఎన్ని డబ్బులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృధా అని తెలిపారు. కాలుష్యాభరిత వాతావరణ పరిస్థితుల్లో యోగా, మెడిటేషన్, ప్రాణాయామం వంటి క్రియలను ఆచరించి ఆరోగ్యానికి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు. యోగ మెడిటేషన్ ప్రాణాయామం వల్ల మనిషి శరీరంలోని 600 కండరాలు 72, వేల నాడీ వ్యవస్థ 25 ఎముకలతో పాటు శరీరంలోని ప్రతి అవయవం ఉత్తేజం చెంది మనిషి చురుగ్గా ఉండడమే కాకుండా యవ్వనంగా కనిపిస్తారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా గుర్తిస్తూ గ్రామ గ్రామాన యోగ విశిష్టతను ఆవశ్యకతను తెలియజేసినట్టు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుండి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు యోగ తప్పనిసరిగా చేయాలన్నారు భవిష్యత్తులో ఇది ప్రతి ఇంటిలో యోగా చేసిటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అలాగే ఆరోగ్య భారతదేశాన్ని ఆవిష్కరించాలని మంచి అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నిర్బంధ యోగాను అమలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. ఈరోజు మనం సంపాదిస్తున్న సంపదలో సగానికి పైగా ఆసుపత్రులకు, మందులకు, రోగాలకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పూర్వకాలంలో మన తాతలు, ముత్తాతలు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అనారోగ్యాలకు దూరంగా ఉన్నారని అన్నారు. ప్రతి రోజు యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ ఫోన్లకు టీవీ సీరియల్ బానిసలు అయ్యారని వాటి ద్వారా కంటిచూపుతోపాటు, మెదడు మిగతా శరీర భాగాలకు విపరీతంగా నష్టం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పాటు మెదక్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్, చేగుంట వైస్ ఎంపీపీ రామచంద్రం, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, దుబ్బాక నియోజకవర్గం కోకన్వీనర్ గోవిందు, మాజీ ఎంపీటీసీ హరిశంకర్, బిజెపి నాయకులు మాసాయిపేట మండల అధ్యక్షుడు వేణు, కుమ్మరి నర్సింలు, సంతోష్ రెడ్డి, సాయిరాజ్, వాసవి క్లబ్ మాజి అధ్యక్షుడు పరంజ్యోతి,పి.డి లు శారద, వెంకటేష్, ఉపాధ్యాయులు రమాదేవి, రహమాన్, అంజూమ్ యోగ కోచ్ సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.