ఇప్పటికే సామాన్యుడికి అందని స్థాయిలో డబుల్‌ సెంచరీ దాటిన టమాట ధరలు ట్రిబుల్‌ సెంచరీ దిశగా అడుగు వేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం మరోసారి టమాట ధరలు భగ్గుమన్నాయి. మదర్‌ డైరీ తన రిటైల్‌ స్టోర్స్‌లో కిలో టమాటాలను 259 రూపాయలకు అమ్మకాలు సాగించింది.


తగ్గినట్టే తగ్గిన ధరలు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో సరఫరా బాగా తగ్గి ధర పెరగడం ప్రారంభించింది. మరికొన్ని రోజుల్లో కిలో ధర 300 రూపాయలకు చేరుకుంటుందని హోల్‌సేల్‌ వర్తకులు చెబుతున్నారు.