14 ఏళ్ల బాలిక దారుణ హత్యకు సంఘటన రాజస్థాన్‌లోని బిల్వారాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్ళితే…

తల్లితో కలిసి మేకలు కాసేందుకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. గ్రామస్థులూ రాత్రంతా గాలించారు, చివరకు తన ఇంటి వద్దే ఓ ఇటుకల బట్టీలో శవమై కనిపించింది. ఆమె ఎముకలు, పట్టీలు, షూస్ ఘటనా స్థలంలో దొరికాయి. అప్పటికే ఆమె శరీరం అప్పటికే మంటల్లో కాలిపోయింది.

హత్య చేసే ముందు సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలోనే దాక్కున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.