హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. సింగూరు నుంచి హైదరాబాద్ కు తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్ కు ఖానాపూర్ దగ్గర భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో ఆగస్టు 7న సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 08 మంగళవారం ఉదయం 6 గంటల వరకు పైప్ లైన్ కు మరమ్మతు పనులు చేయనున్నారు.
ఈ క్రమంలో సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న రిజర్వాయర్ పరిధి ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్..
ఓ అండ్ ఎం డివిజన్ నం 3 : షేక్ పేట, టోలిచౌకి, గోల్కొండ, బోజగుట్ట రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.
ఓ అండ్ ఎం డివిజన్ నం 18 : గండిపేట్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నం పూర్, మంచి రేవుల.