హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక..  సింగూరు నుంచి హైదరాబాద్  కు  తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపు లైన్ కు ఖానాపూర్ దగ్గర  భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో   ఆగస్టు 7న  సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 08  మంగళవారం ఉదయం 6 గంటల వరకు పైప్ లైన్ కు  మరమ్మతు పనులు చేయనున్నారు.

ఈ క్రమంలో   సింగాపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న రిజర్వాయర్ పరిధి ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్..

ఓ అండ్ ఎం డివిజన్ నం 3 : షేక్ పేట, టోలిచౌకి, గోల్కొండ, బోజగుట్ట రిజర్వాయర్ పరిధి ప్రాంతాలు.

ఓ అండ్ ఎం డివిజన్ నం  18 : గండిపేట్, కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నం పూర్, మంచి రేవుల.