ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. దళితబందు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం రావడంతో ఆమె గజ్వేల్ పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు షర్మిలకి వినతిపత్రం పంపించారు. ఇటీవల తీగుల్ గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దగ్దం చేసి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.
పథకంలో అక్రమాలు జరిగాయని.. అర్హులకు దక్కడం లేదని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలనుంచి వచ్చిన వినతి మేరకు షర్మిల రేపు ఉదయం 10 గంటలకు తీగుల్ గ్రామానికి వెళ్లనున్నారు.