ఈ రోజు కోనసీమ జిల్లాలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయటించనున్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు మహిళలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించి తర్వాత సాయంత్రం 4 గంటలకు భవిష్యత్తుకు గ్యారెంటీ పాదయాత్ర చేపడతారు.
అమలాపురంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గడియార స్థంభం సెంటర్ లో భవిష్యత్తుకు గ్యారెంటీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తర్వాత రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరి వెళ్లతారు.