మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి.
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన బుధవారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 39 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఛత్తీస్గఢ్లో కూడా 21 మందితో కూడాని అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.