చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ను చూసేందుకు భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ కార్యక్రమం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇందుకోసం ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది.
కొద్ది రోజుల క్రితం ప్రొపెల్లెంట్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరు చేయబడింది. ఈ ‘ల్యాండర్’ ఈరోజు (బుధవారం) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవం మీద దిగాల్సి ఉంది.
చంద్రుడిపై ‘ల్యాండర్’ విజయవంతంగా ల్యాండ్ అయితే రష్యా, అమెరికా, చైనా తర్వాత 4వ అంతరిక్ష పరిశోధక దేశంగా భారత్ అవతరిస్తుంది. చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన తొలి దేశంగా కూడా ఇది చిరస్థాయిగా రికార్డు సృష్టించనుంది.