G20 సదస్సును అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించడానికి భారత్ ఒక అవకాశంగా పరిగణిస్తోంది. అయితే, పేరు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని చైనా సూచించింది.
ఇండియాను భారత్గా మార్చబోతోందన్న వార్తలపై దేశంలోని ప్రతిపక్షాలు గుర్రుగా ఉండగా.. చైనా మాత్రం భారత్ పై వ్యతిరేక వైఖరినే ప్రదర్శించినట్లు కనిపిస్తోంది.
భారత్ లో విప్లవాత్మక సంస్కరణలు లేకుండా అభివృద్ధిని చూడలేదని, అంతర్జాతీయ ప్రాముఖ్యతను భారత్ తన అభివృద్ధికి మార్గంగా ఉపయోగించుకోగలదా, అంతర్జాతీయ సమాజం దృష్టి రాబోయే G20 సదస్సుపై కేంద్రీకృతమై ఉన్న తరుణంలో, న్యూఢిల్లీ ప్రపంచానికి ఏమి చెప్పదలుచుకుంది?” అని చైనా ప్రశ్నిస్తోంది. పేరు మార్చడం వలస పాలన నీడను చెరిపేయడమేనని చైనా భావిస్తోంది.