నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన యూపీలోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది.

నాలుగేళ్ల బాలిక ఫరూఖాబాద్‌లోని తన ఇంటి ముందు ఆడుకుంటుండగా, కాసేపటికి కనిపించకుండా పోవడంతో… కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కూడా ఊరంతా గాలించారు.

పొలంలో ఓ కుక్కల గుంపు బాలిక మృతదేహాన్ని కుక్కలు కొరుక్కు తుంటుండగా శవాన్ని తన కుమార్తెగా గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవపరీక్షలో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు. నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.