1901లో ప్రారంభమైన నోబెల్ బహుమతిని ప్రపంచంలో అత్యున్నత అవార్డుగా భావిస్తారు.
దీనిని భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి, వైద్యరంగంలో ప్రారంభించి, 1969 నుంచి ఆర్థిక రంగంలో కూడా అవార్డును ప్రారంభించారు.
నోబెల్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్ మనీ పెంచనున్నట్లు ఫౌండేషన్ తెలిపింది. అదనంగా మరో 1 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను ఇస్తామని మొత్తంగా 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను (9,86,000 డాలర్లను) అందచేస్తామని శుక్రవారం ప్రకటించింది.
ఇటీవల సంవత్సరాల్లో ప్రైజ్ మనీ పలుమార్లు సర్దుబాటు చేశారు.