తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి.
ఈ రోజు పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి, శ్రీవక్రత్తాళ్వార్కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు.
ఈరోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నిన్న రాత్రి అశ్వవాహనంపై కల్కి అలంకరణలో మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.