పోలీసులు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని వార్ రూం ద్వారా కీలక ప్రాంతాల్ని గమనించేలా ఏర్పాట్లు చేశారు.
బాలాపూర్ నుంచి హుస్సేనాసాగర్ వరకూ 19 కిలోమీటర్లు సాగే ఊరేగింపు మార్గాల్లోని ప్రధాన ప్రాంతాలన్నీ నిఘా కెమెరాల నీడలో ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్కు 3,600సీసీ కెమెరాలు అనుసంధానించారు. ఈ సారి సుమారు 1.20 లక్షలకుపైగా గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశముంది.