గణేశ్ ఊరేగింపు, నిమజ్జనం కోసం రాజధానిలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు కమిషనరేట్లలో కలిపి రికార్డు స్థాయిలో 40వేల మంది పోలీసుల్ని బందోబస్తు కోసం ఉపయోగిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25,694మంది విధుల్లో పాల్గొంటున్నారు. 125ప్లటూన్ల అదనపు బలగాలు, ఆర్ఎఫ్, పారా మిలిటరీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. సైబరాబాద్, రాచకొండలో కలిపి 13వేల మంది గస్తీలో పాల్గొననున్నారు.